• facebook
  • whatsapp
  • telegram

పది విద్యార్థులకూ స్టడీ మెటీరియల్‌

* ఆవిష్కరించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి


ఈనాడు, హైదరాబాద్‌: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలన్న సంకల్పంతో వారికోసం స్టడీ మెటీరియల్‌ను తయారు చేశామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మంత్రి తన కార్యాలయంలో ఏప్రిల్ 6న‌ స్టడీ మెటీరియల్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఆంగ్లం, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో రూపొందించామని, ప్రస్తుతానికి వాటిని ఎస్‌సీఈఆర్‌టీ వెబ్‌సైట్‌ (www.scert.telangana.gov.in) లో అందుబాటులో ఉంచామని చెప్పారు. ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్న విద్యార్థులు మాతృభాషలో సాంకేతిక పదాలను నేర్చుకోవడానికి బహుభాషా నిఘంటువును రూపొందించామన్నారు. గణితం, భౌతిక, రసాయన, జీవ, సాంఘిక శాస్త్రాల్లోని సాంకేతిక పదాలు ఆంగ్లం, తెలుగు, హిందీ, కన్నడ, మరాఠి, తమిళం భాషల్లో అందుబాటులో ఉంటాయన్నారు. ఇది రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) చరిత్రలో మరో మైలురాయిగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌, ఎమ్మెల్సీ రఘోత్తమ్‌రెడ్డి, పాఠశాల విద్య సంచాలకురాలు శ్రీదేవసేన, ఎస్‌సీఈఆర్‌టీ సంచాలకురాలు రాధారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెలుగు మీడియం స్ట‌డీ మెటీరియ‌ల్
గ‌ణితం
 భౌతికర‌సాయ‌న‌ శాస్త్రం
 జీవ‌శాస్త్రం
 సాంఘిక శాస్త్రం 
ENGLISH MEDIUM STUDY MATERIAL
MATHEMATICS
PHYSICS
BIOLOGY
SOCIAL STUDIES

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 07-04-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.