• facebook
  • whatsapp
  • telegram

పెండింగ్‌లోనే 4,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ

* న్యాయ వివాదాలతో నిలిచిన నియామకాలు
* విద్యార్థుల సంఖ్య పెరిగితే బోధన కష్టమే

ఈనాడు, అమరావతి: డీఎస్సీ-2018 నిర్వహించి దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఇంతవరకూ అన్ని పోస్టులనూ భర్తీ చేయలేదు. దీంతో కొత్త డీఎస్సీ ప్రకటన నిలిచిపోయింది. ఫలితంగా నిరుద్యోగులకు ఎదురుచూపులు తప్పట్లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, కరోనా ప్రభావంతో ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య పెరుగుతుందంటున్న అధికారులు.. ఆ మేరకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై దృష్టి సారించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోస్టుల భర్తీ ప్రకటన సమయంలో అధికారులు చేస్తున్న పొరపాట్లవల్ల న్యాయ వివాదాలు ఏర్పడుతున్నాయి. దీంతో నియామకాలు పెండింగ్‌లో పడుతున్నాయి.
సగానికిపైగా..
*  డీఎస్సీ-2018లో 7,902 పోస్టులు ప్రకటించగా.. ఇప్పటికీ భర్తీకానివే 4,481 ఉన్నాయి.
*  తొలిసారిగా గత డీఎస్సీకి ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించారు. దీంతో ఎస్జీటీ పరీక్షలు 16 సెషన్లలో జరిగాయి.
*  ఒక విడతలో ప్రశ్నపత్రం తేలిగ్గా, మరో విడతలో కఠినంగా వచ్చిందని.. మొత్తం పరీక్షను సాధారణీకరణ (నార్మలైజేషన్‌) చేయాలని కోరుతూ కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
*  భాషా పండితులు, స్కూల్‌ అసిస్టెంట్లు (భాషలు) పోస్టుల విషయంలోనూ వివాదం ఏర్పడింది.
*  ఆదర్శ పాఠశాలల ప్రిన్సిపాళ్ల పోస్టులకు గతంలో పనిచేసిన సమయంలో నిర్దిష్టమైన వేతనం ఉండాలన్న నిబంధన పెట్టారు. ప్రైవేటులో పనిచేసిన వారికి అంత వేతనం లేదంటూ వేతనాన్ని తగ్గిస్తూ మరో సవరణ ఉత్తర్వు జారీచేశారు. ఇది న్యాయ వివాదానికి దారి తీసింది.
*  వ్యాయామ ఉపాధ్యాయులకు మొదటిసారిగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహించారు. దీనిపై కొందరు న్యాయస్థానానికి వెళ్లారు.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.