* రాబోయే నాలుగేళ్లలో చేపడతాం
ఈనాడు, అమరావతి: రాబోయే నాలుగేళ్లలో సంవత్సరానికి 6,500 చొప్పున పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఏటా డిసెంబరులో ఖాళీలను గుర్తించి, జనవరిలో నియామక షెడ్యూల్ విడుదల చేస్తామని వెల్లడించారు. పోలీసుశాఖలో ప్రస్తుతమున్న ఖాళీలతోపాటు, వారాంతపు సెలవుల విధానానికి కావాల్సిన అదనపు సిబ్బందిని దృష్టిలో పెట్టుకుని ఈ భర్తీ ప్రక్రియ చేపడతామన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ నగరపాలక మైదానంలో అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.