‣ సుప్రీంకోర్టుకు తెలిపిన ఐసీఏఐ
దిల్లీ: రానున్న సీఏ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించడం వీలుకాదని ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్ అకౌంటెంట్స్ (ఐసీఏఐ) సుప్రీంకోర్టుకు నవంబరు 4న తెలిపింది. తాము నిర్వహించే పరీక్షలు.. భిన్నమైన నమూనాలో జరుగుతాయని.. సమాధానాలు వివరణాత్మకంగా, విశ్లేషణాత్మకంగా అభ్యర్థులు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. కొవిడ్-19 నేపథ్యంలో సీఏ పరీక్షల నిర్వహణపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కొంత మంది అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్కు సమాధానంగా.. ఐసీఏఐ తరఫున న్యాయవాది తన వాదనలు వినిపించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది కోరినట్లు ఆన్లైన్ పరీక్షలు సాధ్యం కాదని తెలిపారు. ఈ వాదనతో కోర్టు ఏకీభవించింది. ‘‘చాలా విషయాలను కోర్టులు అనుమతిస్తున్నాయి కాబట్టి..ప్రతీది అనుమతించమనడం సమంజసం కాదు. డిమాండ్లలో హేతుబద్ధత పాటించాలి’’ అని న్యాయమూర్తి జస్టిస్ ఏ.ఎం.ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషనర్లను మందలించింది. కొవిడ్-19కు సంబంధించి విద్యార్థుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలను వెబ్సైట్లో ప్రచురించాలని ఐసీఏఐను ఆదేశిస్తూ.. విచారణను ముగిస్తున్నట్లు ప్రకటించింది.సీఏ పరీక్షలు.. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 14వరకు జరగనున్నాయి.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.