ఈనాడు, అమరావతి: డిగ్రీ కళాశాలల్లో బోధన రుసుమును ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఖరారు చేసింది. ఈ ఏడాది డిగ్రీ ప్రవేశాలను ఆన్లైన్లో నిర్వహిస్తున్నందున నోటిఫికేషన్ కంటే ముందుగానే రుసుములను ప్రకటించాల్సి ఉంది. గతంలో విశ్వవిద్యాలయాల వారీగా డిగ్రీ కోర్సులకు రుసుములు ఉండగా ఈ ఏడాది మొదటిసారిగా కమిషన్ రుసుములను నిర్ణయించింది. కళాశాలలను మూడు గ్రేడ్లుగా విభజించి కోర్సుల వారీగా ఫీజులను నిర్ణయించారు. గరిష్ఠంగా బీఎస్సీకి రూ.15 వేలు, బిఏ తదితర కోర్సులకు రూ.10 వేల వరకు రుసుములు ఉండనున్నాయి. ఆన్లైన్ ప్రవేశాలకు శని లేదా నవంబరు 9 న ప్రకటన విడుదల కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,085 ప్రైవేటు డిగ్రీ కళాశాలలకు ఆన్లైన్ ప్రవేశాలు నిర్వహించనున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.