ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ఫార్మసీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ షెడ్యూల్ను కన్వీనర్ ఎం.ఎం.నాయక్ విడుదల చేశారు. ప్రాసెసింగ్ రుసుము చెల్లింపునకు డిసెంబరు 8 నుంచి 10 వరకు, ధ్రువపత్రాల పరిశీలనకు 9 నుంచి 10 వరకు, సీట్లు, కళాశాలల ఎంపికకు ఐచ్ఛికాలు నమోదు చేసుకునేందుకు డిసెంబరు 8 నుంచి 10 వరకు అవకాశం కల్పించారు. డిసెంబరు 12న సీట్లను కేటాయించనున్నారు.
ప్రైవేటు విద్యార్థులకు హాజరు మినహాయింపు
ఇంటర్ ప్రైవేటు విద్యార్థులకు హాజరునుంచి మినహాయింపునిస్తూ ఇంటర్ విద్యామండలి ఉత్తర్వులనిచ్చింది. కళాశాలకు వెళ్లని, ఆర్ట్స్ గ్రూపు కాంబినేషన్ వారు మార్చిలో పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతించింది. హాజరు మినహాయింపునకు డిసెంబరు 18లోపు రూ.1,300 ఫీజు చెల్లించాలని పేర్కొంది. అపరాధ రుసుము రూ.200తో 24వరకు అవకాశమిచ్చింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.