నూజివీడు, న్యూస్టుడే: నివర్ తుపాను నేపథ్యంలో వాయిదా వేసిన ఆర్జీయూకేటీ సెట్ను డిసెంబరు 5న నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కన్వీనర్ డి.హరినారాయణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 630, తెలంగాణలో 8 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అదేరోజు ప్రాథమిక ‘కీ’ని విడుదల చేస్తామని, ఏవైనా అభ్యంతరాలుంటే 7వ తేదీలోగా తెలియజేయాలని సూచించారు. డిసెంబరు 8న తుది ‘కీ’ విడుదల చేసి, డిసెంబరు 12న ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు. ఈ పరీక్షకు 48,422 మంది బాలురు, 40,550 మంది బాలికలు దరఖాస్తు చేసుకున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.