* విద్యాశాఖ పరిశీలనలో పలు ప్రతిపాదనలు
* ముఖ్యమంత్రి సమీక్ష అనంతరం తుది నిర్ణయాలు
తెలంగాణ టెన్త్ క్లాస్ ఫైనల్ పరీక్షలో 11 పేపర్లను 6 పేపర్లకు కుదించాలని విద్యాశాఖ పరిశీలిస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రితో త్వరలో జరగబోయే సమీక్షలో తుది నిర్ణయం వెలువడుతుంది. కరోనా కల్లోలం నేపథ్యంలో ఇప్పటికే సిలబస్ ను 70 శాతానికి తగ్గించారు. అందుకు అనుగుణంగా ఆన్ లైన్ లో తరగతులు నిర్వహస్తున్నారు. మిగిలిన 30 శాతాన్నిఅసైన్ మెట్లకు కేటాయించారు. పరిస్థితులు ఇంకా పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో సంవత్సరాంత పరీక్షల్లో పేపర్లను తగ్గించే యోచన చేస్తున్నారు. ఇంతకు ఒక్కో సబ్జెక్టుకు రెండు పేపర్లు, హిందీకి ఒక పేపర్ తో కలిపి మొత్తం 11 పేపర్లు ఉండేవి. ఒక్కో పేపర్ కు రెండున్నర గంటల సమయం ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో పేపర్ చొప్పున మొత్తం 6 పేపర్లు మాత్రమే ఇస్తారు. ఒక్కో పేపర్ కు సమయాన్ని కూడా ఒకటిన్నర గంటలకు తగ్గించాలని భావిస్తున్నారు. ఇందుకోసం పరీక్ష పేపర్ లో తగిన మార్పులు చేస్తారు. ప్రశ్నల్లో ఛాయిస్ కూడా పెంచే ఆలోచన ఉంది. వ్యాస రూప ప్రశ్నలు ఇవ్వడం కుదరకపోతే మొత్తం పరీక్ఆషను బ్జెక్టివ్ విధానంలో నిర్వహించాలనీ చూస్తున్నారు. త్వరలో వీటిపై తుది నిర్ణయం వెలువడుతుంది.
మూడు నుంచి తొమ్మిది తరగతుల వారికీ వార్షిక పరీక్షలను ఆబ్జెక్టివ్ తరహాలో జరపాలనే అనుకుంటున్నారు. ఇప్పటికే నెలవారీ, ఆరు నెలల పరీక్షలను రద్దు చేశారు. ఈ ప్రతిపాదనలన్నింటినీ త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు ఉంచుతారు. విద్యాశాఖ సమీక్ష సమావేశంలో సీఎం సూచనల మేరకు తుది నిర్ణయాలు వెలువడతాయి.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.