• facebook
  • whatsapp
  • telegram

జేఈఈ మెయిన్‌ నాలుగుసార్లు!

ఫిబ్రవరి-మే మధ్య కాలంలో ప్రతి నెలా ఒక పరీక్ష
‣ 90 ప్రశ్నల్లో.. 75కు జవాబులు గుర్తించే వెసులుబాటు
జేఈఈ, నీట్‌ పాఠ్య ప్రణాళిక యథాతథం
‣ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెల్లడి

ఈనాడు - హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఈసారి జేఈఈ మెయిన్‌-2021ను నాలుగుసార్లు నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ భావిస్తోంది. కరోనా పరిస్థితుల కారణంగా విద్యార్థులు తరగతి గదికి దూరమైనందున బహుళ ఐచ్ఛిక ప్రశ్నల్లోనూ  ఛాయిస్‌ ఇవ్వనుంది. జాతీయస్థాయి ప్రవేశ, బోర్డు పరీక్షలు, సిలబస్‌ తదితర అంశాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌  డిసెంబ‌రు 10న విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఆన్‌లైన్‌లో మాట్లాడారు. పలువురు అడిగిన సందేహాలకు సమాధానాలిచ్చారు. జేఈఈ మెయిన్‌పై ఇప్పటికే పలు సూచనలు వచ్చాయని, వాటిని పరిగణనలోకి తీసుకున్నామని మంత్రి తెలిపారు. అందుకు అనుగుణంగా ఫిబ్రవరి నెలాఖరులో ఒకటి, మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో నెలకు ఒకటి చొప్పున మొత్తం నాలుగుసార్లు పరీక్ష నిర్వహించేందుకు సానుకూలంగా ఉన్నామన్నారు. ప్రతి విద్యార్థి నాలుగు విడతల్లోనూ పరీక్ష రాసుకునే వెసులుబాటు ఇచ్చే అంశాన్ని సానుకూల దృకృథంతో పరిశీలిస్తామన్నారు. ప్రతి విడతలో 3-4 రోజుల చొప్పున పరీక్షలు ఉంటాయన్నారు.

గత ఏడాది పాఠ్య ప్రణాళికే.. కానీ
ఈసారి జేఈఈ మెయిన్‌కు పాత పాఠ్య ప్రణాళికే (సిలబస్‌) ఉంటుందని, కాకపోతే కరోనా పరిస్థితుల దృష్ట్యా ఛాయిస్‌ ఇవ్వాలనే ఆలోచన ఉందని మంత్రి స్పష్టం చేశారు. ‘గతంలో గణితం, భౌతిక, రసాయన శాస్త్రాల్లో కలిపి 75 ప్రశ్నలు ఇచ్చేవారు. ఈసారి ఒక్కో సబ్జెక్టులో 30 చొప్పున మొత్తం 90 ప్రశ్నలు ఇచ్చి, ఒక్కోదానిలో 25 ప్రశ్నలకు జవాబులు గుర్తిస్తే ఆ మేరకు మార్కులు ఇచ్చే ప్రతిపాదన పరిశీలనలో ఉంది’ అని చెప్పారు. నీట్‌కు కూడా గతేడాది పాఠ్య ప్రణాళిక యథాతథంగా ఉంటుందని స్పష్టం చేశారు.

నీట్‌ పరీక్ష విధానంపై సంప్రదింపులు
నీట్‌ నిర్వహించే తేదీని కేంద్ర ఆరోగ్య శాఖ, జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ)తో సంప్రదించి ఖరారు చేస్తామని మంత్రి తెలిపారు. సమీప భవిష్యత్తులో తేదీని వెల్లడిస్తామన్నారు.పరీక్ష ఆన్‌లైన్‌లోనా? ఆఫ్‌లైన్‌లోనా? అన్న దానిపై ఆరోగ్యశాఖతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. పది, 12వ తరగతి వార్షిక పరీక్షల తేదీలను ఖరారు చేసే క్రమంలో అన్ని రాష్ట్రాలతో చర్చిస్తున్నట్టు చెప్పారు. సీబీఎస్‌ఈ ప్రయోగ పరీక్షల రద్దుపై మంత్రి మాట్లాడుతూ ప్రాక్టికల్‌, బోర్డు పరీక్షల తేదీలపై సీబీఎస్‌ఈనే నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.

పరీక్షలు వాయిదా వేయండి.. సిలబస్‌ తగ్గించండి!

జేఈఈ-2021 స్టడీమెటీరియల్

రసాయన శాస్త్రం భౌతికశాస్త్రం గణితశాస్త్రం
పాత ప్రశ్నపత్రాలు నమూనా ప్రశ్నపత్రాలు  

నీట్-2021 స్టడీమెటీరియల్

జీవశాస్త్రం రసాయన శాస్త్రం భౌతికశాస్త్రం
పాత ప్రశ్నపత్రాలు నమూనా ప్రశ్నపత్రాలు  

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 10-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.