* కేంద్ర మంత్రి అశ్వనీ కుమార్ చౌబే వెల్లడి
ఈనాడు, దిల్లీ: దేశవ్యాప్తంగా 2018-19లో 274, 2019-20లో 273 ఎంబీబీఎస్ సీట్లు ఖాళీగా ఉన్నాయని, అందులో 2018-19లో ఆంధ్రప్రదేశ్లో 2, తెలంగాణలో 75, 2019-20లో ఏపీలో ఆరు, తెలంగాణలో 8 ఖాళీలున్నాయని కేంద్ర మంత్రి అశ్వనీ కుమార్ చౌబే తెలిపారు. పీజీ వైద్య సీట్లకు సంబంధించి దేశవ్యాప్తంగా 2018-19లో 4002 సీట్లు ఖాళీగా ఉండగా అందులో ఏపీలో 303, తెలంగాణలో 53 సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. 2019-20 సంవత్సరానికి సంబంధించి పీజీ వైద్య సీట్లు 4614 ఖాళీగా ఉండగా ఏపీలో 149, తెలంగాణలో 99 ఖాళీగా ఉన్నాయని రాజ్యసభలో ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. దేశవ్యాప్తంగా 2018లో బీడీఎస్ సీట్లు 3,317 ఖాళీగా ఉండగా ఏపీలో 60, తెలంగాణలో నాలుగు, 2019లో దేశవ్యాప్తంగా 2,774 ఖాళీలుండగా ఏపీలో 15, తెలంగాణలో 21 సీట్లు ఖాళీగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.