* కన్వీనర్ కోటాలో కొత్తగా 5,797
* మొదలైన సీపీగెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం(2020-21) సంప్రదాయ పీజీ సీట్లు భారీగా పెరిగాయి. గత ఏడాది కన్వీనర్ కోటా 80 శాతం కింద 264 కళాశాలల్లో 31,753 ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ సీట్లు ఉండగా.. 5,797 పెరిగి 37,300కు చేరాయి. సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాలు, ప్రభుత్వ కళాశాలలు దాదాపు 26 చోట్ల కొత్తగా పీజీ కోర్సులు ప్రవేశపెట్టాయి. మరికొన్ని ప్రైవేట్ కళాశాలలు కూడా కొత్త కోర్సులను అందుబాటులోకి తేవడంతో సీట్లు పెరిగాయి. కామర్స్, ఆంగ్లం, స్టాటిస్టిక్స్, న్యూట్రిషన్, రసాయనశాస్త్రం తదితర కోర్సుల్లో ఎక్కువగా సీట్లు పెరిగినట్లు చెబుతున్నారు. మరోవంక.. కళాశాలల సంఖ్య 290కు చేరుకుంది. సీపీగెట్ కౌన్సెలింగ్లో భాగంగా ఫిబ్రవరి ఒకటో తేదీ రాత్రి నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మొదలైందని, 5వ తేదీ వరకు అవకాశం ఉందని సీపీగెట్ కన్వీనర్ ఆచార్య కిషన్ చెప్పారు.
* విద్యాశాఖ ప్రతిపాదనను అంగీకరించని ఓయూ
ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలల్లో సెక్షన్కు పీజీ సీట్లను 60కు పెంచాలని కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ ఓయూకు లేఖ రాశారు. వర్సిటీ అధికారులు మాత్రం గతంలో మాదిరిగానే సైన్స్ కోర్సుకు 30, ఆర్ట్స్కు 40 సీట్లకే అనుమతించినట్లు తెలిసింది. రెండో విడత కౌన్సెలింగ్ నాటికి కనీసం మరో 500 సీట్లు అదనంగా కలిసే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.