ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకుల సొసైటీల్లో 2020-21 విద్యా సంవత్సరానికి ఐదోతరగతిలో ప్రవేశాలకు రెండో విడత మెరిట్ జాబితాను ఫిబ్రవరి 04వ తేదీన విడుదల చేయనున్నట్లు ఉమ్మడి ప్రవేశ పరీక్ష కన్వీనర్ ప్రవీణ్కుమార్ తెలిపారు. మెరిట్ జాబితాలో స్థానం పొందిన విద్యార్థులు ఫిబ్రవరి 15లోగా సంబంధిత పాఠశాలల్లో రిపోర్టు చేయాలని సూచించారు. మెరిట్ జాబితాలకు ఆయా సొసైటీల వెబ్సైట్లు సందర్శించాలన్నారు.
* 44 శాతం దాటిన హాజరు
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ గురుకులాల్లో విద్యార్థుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. ఫిబ్రవరి 02వ తేదీన 32 శాతం హాజరు ఉంటే ఫిబ్రవరి 03వ తేదీ నాటికి 44 శాతానికి చేరింది. వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్, హైదరాబాద్ జిల్లాల పరిధిలో 75 శాతం దాటింది. వెనుకబడిన జిల్లాలకు చెందిన విద్యార్థులు ఇప్పుడిప్పుడే పాఠశాలలకు వస్తున్నారు. పాఠశాలలకు దూరంగా నివసిస్తున్న వారు రావడానికి ఆలస్యమవుతోందని సొసైటీలు భావిస్తున్నాయి. రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాలు నూరు శాతం సురక్షితమని, కరోనా నిబంధనల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్కుమార్ తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.