• facebook
  • whatsapp
  • telegram

ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థల పునఃప్రారంభం

* ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌కు సీఏం ఆదేశం

హైదరాబాద్‌: తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థల పునఃప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఈమేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. తొమ్మిదో తరగతి, ఆ పైన తరగతులకు క్లాసులు నిర్వహించనున్నారు. విద్యా, వైద్య, రెవెన్యూ శాఖలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవడమే ప్రధాన ఎజెండాగా మంత్రులు, కలెక్టర్లతో సీఎం సమావేశమయ్యారు. 

సంక్రాంతి తర్వాత తొమ్మిదో తరగతి, ఆ పైబడిన క్లాసుల నిర్వహణకు విద్యాశాఖ ఇప్పటికే ఓ నివేదిక రూపొందించింది. విద్యాశాఖ నివేదికపై ఈ సమావేశంలో సీఎం పూర్తిగా చర్చించారు. ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలు, స్థానిక పరిస్థితులను సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి.కాగా, సంక్రాంతి పండుగ ముగిసిన వెంటనే 18వ తేదీ లేదా 20వ తేదీ నుంచి తరగతులను ప్రారంభించాలని విద్యాశాఖ ప్రతిపాదించింది. అయితే, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, కరోనా వ్యాక్సినేషన్‌ కూడా ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. అన్నిశాఖల్లో వెంటనే పదోన్నతులు ఇవ్వాలని, ఖాళీలన్నీ ఒకేసారి వెంటనే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. 
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 11-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.