ఈనాడు, హైదరాబాద్: పాఠశాలల్లో విద్యార్థుల హాజరు నమోదు శాతం క్రమేణా పెరుగుతోంది. బడుల పునఃప్రారంభమైన మొదటిరోజు కంటే రెండో రోజు ఫిబ్రవరి 2న సందడి పెరగడం విశేషం. తొమ్మిదో తరగతిలో సగటున 47 శాతం, పదో తరగతిలో 58 శాతం విద్యార్థులు వచ్చారు. తొలిరోజు ఆ శాతాలు వరుసగా 41, 54గా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం కంటే మంగళవారం హాజరు శాతం పెరిగిందని విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫిబ్రవరి 2న మహేశ్వరం మండలం కేసీతండాలోని కేజీబీవీని తనిఖీ చేశారు. పాఠశాల విద్యాశాఖ అధికారులు ఆయా జిల్లాల్లో పర్యటిస్తూ బడులను తనిఖీ చేస్తున్నారు. సంచాలకురాలు శ్రీదేవసేన మేడ్చల్ జిల్లా గౌడవెల్లి ఉన్నత పాఠశాలలను పరిశీలించారు. ఓయూ, కాకతీయ తప్ప మిగిలిన అన్ని విశ్వవిద్యాలయాల్లో హాస్టళ్లు తెరిచారు. కొవిడ్ పరీక్ష చేయించుకున్న తర్వాతే రావాలన్న నిబంధన విధించడంతో హాజరు శాతం తక్కువగా ఉంది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.