• facebook
  • twitter
  • whatsapp
  • telegram

RGUKT AP: ట్రిపుల్‌ఐటీ-ఏపీలో పీయూసీ, బీటెక్‌ ప్రోగ్రామ్ 

ఏపీలోని రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) నిర్వహిస్తున్న నాలుగు ట్రిపుల్‌ఐటీ క్యాంపస్‌లలో ప్రవేశాల ప్రకటన విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరానికి ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు ఆసక్తి ఉన్న విద్యార్థులు మే 8 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. జూన్‌ నెల 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. తాత్కాలిక ఎంపిక ఫలితాలు జులై 11న వెల్లడి కానున్నాయి. ఏపీ, తెలంగాణ విద్యార్థులతో పాటు ఇతర రాష్ట్రాల విద్యార్థులు దరఖాస్తుకు అర్హులే.

ఆర్జీయూకేటీ ఏపీ క్యాంపస్: ఆర్‌కే వ్యాలీ క్యాంపస్, నూజివీడు క్యాంపస్, శ్రీకాకుళం క్యాంపస్, ఒంగోలు క్యాంపస్.

ప్రవేశ ప్రకటన ముఖ్యాంశాలు...

మొత్తం నాలుగు క్యాంపస్‌లలో 4000 సీట్లు భర్తీ కానున్నాయి. ప్రతి క్యాంపస్‌కు 1000 సీట్లు కేటాయించారు. 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద మరో 400 సీట్లు అదనంగా భర్తీ చేస్తారు. 

మొత్తం సీట్లలో 85 శాతం రాష్ట్ర విద్యార్థులకు కేటాయిస్తారు. మిగిలిన 15 శాతం సీట్లకు రాష్ట్రంతోపాటు తెలంగాణ విద్యార్థులు కూడా పోటీపడతారు.

ఈ సంవత్సరం (2024) పదో తరగతి పాసైన వారు మాత్రమే ప్రవేశాలకు అర్హులు. 

 పీయూసీకి ట్యూషన్‌ ఫీజు ఒక్కో ఏడాదికి రూ.45 వేలు. బీటెక్‌ ప్రోగ్రాంకు ఏడాదికి రూ.50 వేలు. ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు ట్యూషన్‌ ఫీజు ఏడాదికి రూ.1.50 లక్షలు.

దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.200, ఇతరులకు రూ.300.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ప్రాధాన్యం ఉంటుంది.

ఒకవేళ ఇద్దరు విద్యార్థుల స్కోర్‌ సమానంగా ఉంటే ఏడు కొలమానాలను పరిగణనలోకి తీసుకుంటారు. మొదట గణితంలో, తర్వాత సైన్స్‌, ఆంగ్లం, సాంఘికశాస్త్రం, ప్రథమ భాషలో గ్రేడ్‌ను పరిశీలించి సీట్లు ఇస్తారు. అవీ సమానంగా ఉంటే పుట్టిన తేదీ ఆధారంగా ఎక్కువ వయసు ఉన్న వారికి సీటు కేటాయిస్తారు. అది కూడా సమానంగా ఉంటే హాల్‌టికెట్‌ ర్యాండమ్‌ నంబరు విధానాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.

 పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్‌ నియమావళి అనుసరించి సీట్లు కేటాయిస్తారు. ఆర్జీయూకేటీ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఆమోదించిన ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతిలో విద్యార్థులు సాధించిన మార్కులకు 4 శాతం మార్కులు కలుపుతారు. రెండేళ్ల పీయూసీ అనంతరం విద్యార్థులకు బయటకు వెళ్లే వెసులుబాటు కల్పిస్తారు. 

అభ్యర్థుల మెరిట్‌ ఆధారంగా కేటగిరీ ప్రకారం ప్రాధాన్య క్రమంలో క్యాంపస్‌లను కేటాయిస్తారు. అందువల్ల అభ్యర్థులు తమ క్యాంపస్‌ ప్రాధాన్యాలను జాగ్రత్తగా సూచించాలి. ఒకసారి క్యాంపస్‌ నిర్ధారణ జరిగిన తర్వాత బదిలీకి అవకాశం ఉండదు. విద్యార్థులు ప్రవేశం పొందిన క్యాంపస్‌లోనే చదవాల్సి ఉంటుంది.

ఇదీ ప్రవేశాల కాలపట్టిక..

నోటిఫికేషన్‌ విడుదల: 06-05-2024.

ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 08-05-2024.

ఆఖరు తేదీ: 25-6-2024 సాయంత్రం 5 గంటల వరకు

ప్రత్యేక క్యాటగిరీ అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలన ఆర్జీయూకేటీ నూజివీడు ప్రాంగణంలో తేదీల వారీగా..

సైనిక సంతతి కోటా: 01-7-2024 నుంచి 03-7-2024 వరకు.

క్రీడలు: 03-7-2024 నుంచి 06-7-2024 వరకు.

దివ్యాంగులు: 03-7-2024.

భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌: 02-7-2024 నుంచి 03-7-2024 వరకు.

ఎన్‌సీసీ: 03-7-2024 నుంచి 05-7-2024 వరకు.

తాత్కాలిక ఫలితాల ప్రకటన: 11-7-2024.

ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన..

నూజివీడు ప్రాంగణం: జులై 22, 23 తేదీల్లో 

ఆర్కే వ్యాలీ (ఇడుపుల పాయ): జులై 22, 23 తేదీల్లో 

ఒంగోలు ప్రాంగణం: జులై 24, 25 తేదీల్లో (ఇడుపులపాయ)

శ్రీకాకుళం ప్రాంగణం: జులై 26, 27 తేదీల్లో 


 

Some more information 

"Celebrating Excellence: Yasir M.'s Extraordinary Achievement"


Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 08-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :