• facebook
  • whatsapp
  • telegram

Admissions: యాదాద్రి సంస్కృత పాఠశాలలో ప్రవేశాలు

యాదగిరిగుట్ట పట్టణం, న్యూస్‌టుడే: యాదగిరిగుట్ట విద్యాపీఠం 2022-23 విద్యా సంవత్సరానికి సంస్కృత కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం-నల్గొండ అనుబంధ సంస్థగా కొనసాగుతున్న విద్యాపీఠంలో అన్నివర్గాల విద్యార్థులకు ప్రవేశం ఉంది. పాఠశాలలో చేరిన వారికి ఉచిత విద్య, వసతి, భోజనం అందిస్తుంది. సంస్కృతంతోపాటు ఆంగ్లం కూడా బోధిస్తారు. ఈ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నత విద్యావకాశాలుగా బీఏఎల్‌, ఎంఏ, బీఈడీ చేసేందుకు, ఇతర పోటీ పరీక్షలకు అర్హులని ప్రిన్సిపల్‌ జానకి తెలిపారు. యాదగిరిగుట్ట బస్టాండు సమీపంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనంలో కొనసాగుతున్న విద్యాపీఠంలో నేరుగా సంప్రదించి దరఖాస్తులు పొందాలని పేర్కొన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ కక్ష సంస్కృతంలో చేరడానికి వరుసగా 6, 7, 8, 9, 10వ తరగతిలో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులకు రెండేళ్ల ప్రీ డిగ్రీ కోర్సు(పి.డి.సి.)లో అవకాశం కల్పిస్తున్నామన్నారు. ప్రవేశాలకు ఆగస్టు 31 చివరి తేదీ కాగా జూన్‌ 12 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 23-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.