• facebook
  • whatsapp
  • telegram

AP DSC: ఏపీలో డీఎస్సీ నిర్వహిస్తారా? వాయిదానా?

పరీక్ష కేంద్రాల ఎంపికకు అవకాశం ఇవ్వని దుస్థితి

అభ్యర్థుల్లో అయోమయం

ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయ నియామక పరీక్ష(డీఎస్సీ)ను షెడ్యూల్‌ ప్రకారం నిర్వహిస్తారా లేదా వాయిదా వేస్తారా అనే దానిపై అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. హైకోర్టు ఆదేశాల మేరకు డీఎస్సీ షెడ్యూల్‌ను మార్చిన పాఠశాల విద్యాశాఖ అధికారులు.. మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 30 వరకు నిర్వహిస్తామని ఇటీవల ప్రకటించారు. పరీక్ష కేంద్రాల ఎంపికకు ఈ నెల 20 నుంచి ఐచ్ఛికాలు నమోదు చేసుకోవాలని, 25 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. కానీ, ఇంతవరకు వెబ్‌సైట్‌లో పరీక్ష కేంద్రాల ఎంపికకే అవకాశం ఇవ్వలేదు. తద్వారా హాల్‌టికెట్ల జారీలోనూ జాప్యం జరిగే ప్రమాదముంది. మరోవైపు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) ఫలితాలను ఈ నెల 14న విడుదల చేయాల్సి ఉండగా ఇంతవరకు విడుదల చేయలేదు. నార్మలైజేషన్‌ ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పరీక్షలను షెడ్యూల్‌ ప్రకారం నిర్వహిస్తారా లేదా అనేదానిపై అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. డీఎస్సీ నిర్వహణపై ఎన్నికల కమిషన్‌ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న విద్యాశాఖ.. కావాలనే పరీక్ష కేంద్రాల ఎంపిక, హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌, టెట్‌ ఫలితాల్లో జాప్యం చేస్తున్నట్లు సమాచారం.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 24-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.