* ఏపీ విద్యాశాఖ వెల్లడి
అమరావతి: సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అనర్హులని ఇటీవల ఏపీ హైకోర్టు ప్రకటించిన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్జీటీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న బీఈడీ అభ్యర్థులందరికీ వారు చెల్లించిన ఫీజును రీఫండ్ చేస్తామని ప్రకటించింది. అభ్యర్థుల ఆధార్ నంబర్కు అనుసంధానమైన బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేస్తామని ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. ఏపీ టెట్కు 2,67,559 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారి హాల్టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు కమిషనర్ ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా టెట్ పరీక్షకు 120 కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. ఎస్జీటీ అభ్యర్థుల్లో 76.5శాతం మందికి వారు ఎంపిక చేసుకున్న మొదటి ప్రాధాన్య కేంద్రాన్నే వారికి కేటాయించినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల గురించి ఎలాంటి సందేహాలు ఉన్నా ఎవరి జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని వారు సంప్రదించాలని సూచించారు. అభ్యర్థుల సౌకర్యార్థం టెట్, డీఎస్సీ కోసం హెల్ప్డెస్క్లు ఏర్పాటుచేశామని.. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అవి పనిచేస్తాయన్నారు. హెల్ప్ డెస్క్కు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు ఇవే.. 95056 19127, 97056 55349, 81219 47387, 81250 46997.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.