* 1,48,881 మంది దరఖాస్తు
ఈనాడు, అమరావతి: ఏపీ రాష్ట్రంలో ఆదివారం (మార్చి 17) జరగనున్న గ్రూపు-1 ప్రిలిమ్స్ పరీక్ష కోసం (స్క్రీనింగ్ టెస్ట్) అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి వెల్లడించారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన శనివారం (మార్చి 16) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలి. ప్రతి పరీక్షా కేంద్రానికి జిల్లా స్థాయి సీనియర్ అధికారులను లైజన్ అధికారులుగా నియమించి పరీక్షలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రస్థాయిలో కంట్రోల్రూం ద్వారా పరీక్షల తీరును పర్యవేక్షించాలి’ అని ఏపీపీఎస్సీ అధికారులను ఆదేశించారు. ఈ పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా 301 కేంద్రాల్లో 1,48,881 మంది రాయనున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.