* సీఎం రేవంత్ ప్రకటన
* గ్యాస్, కరెంటు పథకాలు ప్రారంభం 27న
మేడారం: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీల్లో మరో రెండింటి అమలుకు ముహూర్తం ఖరారైంది. రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గ్యారంటీలను ఫిబ్రవరి 27న సాయంత్రం ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ పథకాల ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ హాజరవుతారని చెప్పారు. శుక్రవారం మేడారం వెళ్లి సమ్మక్క- సారలమ్మలను రేవంత్ దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మార్చి 2న మరో 6 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. త్వరలో ప్రెస్ అకాడమీ ఛైర్మన్ను నియమించి.. జర్నలిస్టుల సమస్యల్ని పరిష్కరిస్తామని వెల్లడించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.