* ఐసెట్కు నరసింహాచారి.. పీజీఈసెట్కు అరుణకుమారి
* ఎడ్సెట్కు మృణాళిని నియామకం
* మిగిలిన 4 ప్రవేశ పరీక్షలకు పాతవారే
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించే ఏడు ప్రవేశ పరీక్షలకు కన్వీనర్లను నియమించారు. ఈసారి మూడింటికి కొత్త కన్వీనర్లను నియమిస్తూ ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి శనివారం(జనవరి 27) ఆదేశాలు జారీ చేశారు. ఎడ్సెట్, ఐసెట్, పీజీఈసెట్కు కొత్త వారు నియమితులు కాగా.. ఎంసెట్, లాసెట్, ఈసెట్, పీఈసెట్కు పాత కన్వీనర్లే కొనసాగనున్నారు. ఎడ్సెట్కు అంతకు ముందు ఉన్న కన్వీనర్ ఆచార్య రామకృష్ణ పదవీ విరమణ పొందటంతో ఓయూకు చెందిన మృణాళినిని కన్వీనర్గా నియమించారు. కాకతీయ వర్సిటీలో కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఆచార్యులుగా పనిచేస్తున్న నరసింహాచారి ఐసెట్ కన్వీనర్గా నియమితులయ్యారు. పీజీఈసెట్కు కన్వీనర్గా నియమితులైన అరుణకుమారి మెకానికల్ ఇంజినీరింగ్ ఆచార్యురాలు. ప్రస్తుతం పరీక్షల నియంత్రణాధికారి(కంట్రోలర్)గా పనిచేస్తున్నారు. ఆయా పరీక్షల నిర్వహణలో కన్వీనర్లదే కీలక పాత్ర. గతంలో మాదిరిగానే ఈసారి కూడా పరీక్షల నిర్వహణ బాధ్యత ఒక విశ్వవిద్యాలయానికి, కన్వీనర్లను మరో వర్సిటీ నుంచి నియమించారు. ఎడ్సెట్ నిర్వహణ బాధ్యతను నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయానికి అప్పగించారు. అక్కడ విద్యావిభాగం(ఎడ్యుకేషన్) లేకపోవడంతో ఓయూకు చెందిన మృణాళినిని కన్వీనర్గా నియమించారు. ఇక ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(పీఈసెట్) నిర్వహణను శాతవాహనకు అప్పగించారు. అక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం లేకపోవడంతో ఓయూలోని రాజేష్కుమార్ను కన్వీనర్గా నియమించారు. ఇతర విశ్వవిద్యాలయాలను కూడా ప్రవేశ పరీక్షల నిర్వహణకు సన్నద్ధం చేసేందుకు ఇలా చేస్తున్నామని ఉన్నత విద్యామండలి వర్గాలు చెబుతున్నాయి.
ప్రవేశ పరీక్ష | కన్వీనర్ పేరు | పనిచేసే విశ్వవిద్యాలయం |
ఎంసెట్ | బి.డీన్కుమార్ | జేఎన్టీయూహెచ్ |
పీజీఈసెట్ | ఎ.అరుణకుమారి | జేఎన్టీయూహెచ్(మెకానికల్) |
ఐసెట్ | ఎస్.నరసింహాచారి | కాకతీయ |
ఎడ్సెట్ | టి.మృణాళిని | ఓయూ(నిర్వహణ ఎంజీయూ) |
లాసెట్ | బి.విజయలక్ష్మి | ఓయూ |
ఈసెట్ | శ్రీరాం వెంకటేష్ | ఓయూ |
పీఈసెట్ | రాజేష్కుమార్ | ఓయూ(నిర్వహణ శాతవాహన) |
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.