ఈనాడు, అమరావతి: ప్రభుత్వ జిల్లా విద్య, శిక్షణ సంస్థల్లో రెండేళ్ల డీఈడీ కోర్సుల ప్రవేశానికి డీఈఈసెట్ను మే 24న నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్య కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 4,949 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.
మరింత సమాచారం ... మీ కోసం!