* 11,062 పోస్టులకు విడుదల
* మే లేదా జూన్లో ఆన్లైన్ విధానంలో పరీక్షలు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధమైంది. 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫిబ్రవరి 29న ఆయన నివాసంలో విడుదల చేయనున్నారు. వీటిలో స్కూల్ అసిస్టెంట్ 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీలు 796 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తుల గడువు, నియమ నిబంధనలు వెల్లడించనున్నారు. మే లేదా జూన్ నెలలో 10 రోజులపాటు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. కొత్త నోటిఫికేషన్కు నిర్ణయించిన ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబరు 6న 5,089 పోస్టులతో జారీ చేసిన డీఎస్సీ ప్రకటన రద్దుకు ఫిబ్రవరి 28న రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్రంగా మరో కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామని అందులో పేర్కొంది. పాత దరఖాస్తులు చెల్లుబాటులో ఉంటాయని.. కొత్త డీఎస్సీకి వాటిని పరిగణనలోనికి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. పాత అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ప్రతి బడికి ఉపాధ్యాయుడు ఉండాలని..
వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభానికి కొత్త ఉపాధ్యాయులు పాఠశాలల్లో ఉండేలా నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. ప్రతి బడికి ఉపాధ్యాయుడు ఉండాలనే సీఎం ఆదేశాలకు అనుగుణంగా విద్యాశాఖ గత మూడు వారాలుగా కసరత్తు చేసి నోటిఫికేషన్ సిద్ధం చేసింది. గతేడాది విడుదల చేసిన నోటిఫికేషన్కు 1,77,502 మంది దరఖాస్తు చేసుకున్నారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో అది జరగలేదు. ప్రభుత్వం మారినందున మరిన్ని పోస్టులను కలిపి నోటిఫికేషన్ ఇచ్చేందుకు పాత ప్రకటనను రద్దు చేసింది. నాటి దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొనేలా సాఫ్ట్వేర్ తయారు చేయించారు. పోస్టుల సంఖ్య పెరగడంతో భారీగా దరఖాస్తులు రావొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రశ్నపత్రాలు మొదలు ఫలితాల వరకూ సాంకేతికతను వినియోగించేలా విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. పరీక్షను ఎంసెట్ తరహాలో నిర్వహించనున్నారని తెలుస్తోంది.
సెకండరీ గ్రేడ్ టీచర్స్
సైకాలజీ (కంటెంట్)
మరిన్ని వాటి కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.