ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్టుడే: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ డిగ్రీ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్ల ప్రవేశానికి సంబంధించి విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ధ్రువపత్రాల పరిశీలన నవంబరు 30వ తేదీతో ముగిసింది. ఈ సందర్భంగా అధికారులు ప్రొవిజినల్ మెరిట్లిస్ట్ను వెల్లడించారు. ఇందులో 13,089 మంది అభ్యర్థుల రిజర్వేషన్ కేటగిరీ, లోకల్, ఈడబ్ల్యుఎస్ వివరాలతో పాటు వారి పేరు, రోల్ నంబరు, నీట్ ర్యాంక్ను పొందుపర్చారు. వీటిలో తప్పులుంటే డిసెంబరు 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా విశ్వవిద్యాలయ హెల్ప్డెస్క్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. అభ్యంతరాలు వస్తే వాటిని మూడు రోజుల్లో పరిశీలించి తుది మెరిట్లిస్ట్ను ప్రకటిస్తామన్నారు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.