• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 29-02-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)    

1.  ఎన్‌డీఎస్‌ఏ కమిటీ ఛైర్మన్‌గా చంద్రశేఖర్‌ అయ్యర్‌

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో సీపేజీకి కారణాలను అధ్యయనం చేసి తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేసేందుకు నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథార్టీ(ఎన్‌డీఎస్‌ఏ) నిపుణుల కమిటీని నియమించింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...




2.  ఇళ్లలో సౌర వెలుగులకు రూ.75,000 కోట్లు 

ఇళ్ల పైకప్పులపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకుని సౌర విద్యుత్తు పొందడానికి కేంద్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి గరిష్ఠంగా రూ.78వేలు రాయితీగా ఇవ్వనుంది. 2023-24 నుంచి 2026-27 వరకు నాలుగేళ్లు నడిచే ఈ పథకానికి రూ.75,021 కోట్లు కేటాయించింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 


3.  గాజాలో ఘోరం

గాజా సిటీలో మానవతా సాయం కోసం ఎదురు చూస్తున్న వారిపై  ఇజ్రాయెల్‌ వైమానిక దాడి జరపడంతోపాటు కాల్పులకు దిగడంతో 104 మంది మరణించారు. 760 మంది గాయపడ్డారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...




4. ఇంటెల్‌ ఇండియా మాజీ హెడ్‌ అవతార్‌  మరణం

ప్రముఖ టెక్‌ కంపెనీ ఇంటెల్‌ ఇండియా మాజీ హెడ్‌ అవతార్‌ సైనీ(68) రోడ్డు ప్రమాదంలో మరణించారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



5. డా. గుళ్లపల్లి ఎన్‌ రావుకు ‘వరల్డ్‌ ఐకాన్స్‌ 21’ అవార్డు

ఎల్వీ ప్రసాద్‌ నేత్ర వైద్య విజ్ఞానసంస్థ (ఎల్వీపీఈఐ) వ్యవస్థాపకుడు డాక్టర్‌ గుళ్లపల్లి ఎన్‌ రావుకు ‘వరల్డ్‌ ఐకాన్స్‌ 21’ అవార్డు దక్కింది.

 పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



6.  అథ్లెట్లకు డిజిటల్‌ సర్టిఫికెట్లు

అథ్లెట్లకు డిజిటల్‌ సర్టిఫికెట్లు ఇస్తామని క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ చెప్పారు. క్రీడల్లో పారదర్శకత పెంచేందుకు ఈ నిర్ణయం తోడ్పడుతుందని భావిస్తున్నారు.

 పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.