* జూన్ ఒకటి వరకు నిర్వహించాలని ఆదేశాలు
ఈనాడు, అమరావతి: హైస్కూల్ ప్లస్లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఏప్రిల్ 24 నుంచి ప్రత్యేక కోచింగ్ తరగతులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో మొదటి సంవత్సరంలో 4,542మంది పరీక్షలు రాయగా వారిలో 1,262 మంది (27.79శాతం).. ద్వితీయ సంవత్సరంలో 2,024 మందికి 690 (34.09%) మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఎక్కువమంది ఫెయిల్ కావడంతో విద్యార్థులు అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు వేసవి సెలవుల్లోనూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. జూన్ ఒకటి వరకు వీటిని కొనసాగించాలని.. విద్యార్థుల హాజరు, పనితీరు విశ్లేషణను గూగుల్ ఫామ్లో రోజూ సాయంత్రం 5లోపు పంపించాలని సూచించింది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం, మధ్యాహ్న భోజన సదుపాయం లేకుండా తరగతులు నిర్వహిస్తే విద్యార్థులు అలసటకు గురయ్యే ప్రమాదం ఉందని అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!
‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..
‣ ఎన్ఐఎన్ కోర్సులతో మెరుగైన అవకాశాలు
‣ కొలువుకు ఎంపికైతే.. నెలకు రూ.లక్ష జీతం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.