* జూన్ 3న ప్రవేశపరీక్ష
హైదరాబాద్: తెలంగాణలోని న్యాయ కళాశాలల్లో ఎల్ఎల్బీ(LLB), ఎల్ఎల్ఎం(LLM) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్(LAW CET), పీజీ ఎల్ సెట్(PG LCET) పరీక్షలకు దరఖాస్తుల గడువు పొడిగించారు. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 25తో అప్లికేషన్ల గడువు ముగియగా.. మరో పది రోజుల పాటు పొడిగించారు. దీంతో ఎలాంటి ఆలస్యరుసుం లేకుండా అభ్యర్థులు మే 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సాధ్యమైనంత త్వరగా దరఖాస్తులు చేసుకోవాలని లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ బి.విజయలక్ష్మి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
మూడు, ఐదేళ్ల ఎల్ఎల్బీ కోర్సులు, రెండేళ్ల ఎల్ఎల్ఎం కోర్సుల్లో చేరేందుకు జూన్ 3న ప్రవేశపరీక్ష జరగనుంది. లాసెట్కు దరఖాస్తు రుసుం రూ.900 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.600); పీజీఎల్ సెట్కు రూ.1,100 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.900) చొప్పున అభ్యర్థులు చెల్లించాల్సి ఉంటుంది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కోచింగ్ లేదు... డెయిలీ టార్గెట్స్ పూర్తీచేశా!
‣ టెక్నికల్ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం!
‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!
‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.