ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు నిర్వహించే సమ్మెటివ్-2 పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి ప్రారంభమవుతాయని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ 6 నుంచి 19 వరకు పరీక్షలు ఉంటాయి. 21 లోపు ప్రశ్నపత్రాల మూల్యాంకనం పూర్తి చేసి, ప్రోగ్రెస్ కార్డులను విద్యార్థులకు 23న అందించాల్సి ఉంటుంది. 1-8 తరగతులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తొమ్మిదో తరగతి వారికి మరో 15 నిమిషాల అదనపు సమయంతో పరీక్షలు నిర్వహిస్తారు. ఎన్నికల కారణంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే షెడ్యూల్ను సవరిస్తామని విద్యాశాఖ పేర్కొంది.
తొమ్మిదో తరగతి మోడల్ పేపర్లు - 2024
ఎనిమిదో తరగతి మోడల్ పేపర్లు - 2024
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.