• facebook
  • whatsapp
  • telegram

Exams: సమ్మెటివ్‌-2 పరీక్షలు ఏప్రిల్‌ 6 నుంచి

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు నిర్వహించే సమ్మెటివ్‌-2 పరీక్షలు ఏప్రిల్‌ 6 నుంచి ప్రారంభమవుతాయని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ షెడ్యూల్‌ ప్రకారం.. ఏప్రిల్‌ 6 నుంచి 19 వరకు పరీక్షలు ఉంటాయి. 21 లోపు ప్రశ్నపత్రాల మూల్యాంకనం పూర్తి చేసి, ప్రోగ్రెస్‌ కార్డులను విద్యార్థులకు 23న అందించాల్సి ఉంటుంది. 1-8 తరగతులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తొమ్మిదో తరగతి వారికి మరో 15 నిమిషాల అదనపు సమయంతో పరీక్షలు నిర్వహిస్తారు. ఎన్నికల కారణంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే షెడ్యూల్‌ను సవరిస్తామని విద్యాశాఖ పేర్కొంది.

తొమ్మిదో త‌ర‌గ‌తి మోడ‌ల్ పేపర్లు - 2024

ఎనిమిదో తరగతి  మోడ‌ల్ పేపర్లు - 2024

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 29-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.