• facebook
  • whatsapp
  • telegram

Exams: ఏప్రిల్‌ 8 నుంచి ఎస్‌ఏ-2 పరీక్షలు 

గోపాలపూర్, న్యూస్‌టుడే: ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలోని పాఠశాలల్లో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎస్‌ఏ)-2 పరీక్షలు ఏప్రిల్‌ 8 నుంచి 18 వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్‌ ఎం.రాధారెడ్డి  మార్చి 12న పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆరు, ఏడు తరగతుల వారికి ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు జరుగుతాయి. అలాగే ఎనిమిదో తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3.45  వరకు, తొమ్మిదో తరగతి వారికి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించాలని సూచించారు. అనంతరం జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి, ఏప్రిల్‌ 23న ఫలితాలు ప్రకటించాలని, అదే రోజు తల్లిదండ్రుల సమావేశాలు ఏర్పాటు చేసి మార్కుల రికార్డులపై సంతకాలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయని ప్రకటించారు.
 



మరింత సమాచారం... మీ కోసం!

‣ కొత్త అవకాశాలకు.. ఆన్‌లైన్‌ టీచింగ్‌!

‣ ఆశయ సాధనకు అలుపెరుగని కృషి!

‣ ఆస్ట్రోఫిజిక్స్‌తో అపార అవకాశాలు!

‣ జనరల్‌ డిగ్రీతో జాబ్‌ సాధ్యమే!

‣ గురుకుల కొలువుల్లో ఆదరగొట్టారు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 13-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.