గోపాలపూర్, న్యూస్టుడే: ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని పాఠశాలల్లో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ)-2 పరీక్షలు ఏప్రిల్ 8 నుంచి 18 వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఎం.రాధారెడ్డి మార్చి 12న పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేశారు. ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆరు, ఏడు తరగతుల వారికి ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు జరుగుతాయి. అలాగే ఎనిమిదో తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3.45 వరకు, తొమ్మిదో తరగతి వారికి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించాలని సూచించారు. అనంతరం జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి, ఏప్రిల్ 23న ఫలితాలు ప్రకటించాలని, అదే రోజు తల్లిదండ్రుల సమావేశాలు ఏర్పాటు చేసి మార్కుల రికార్డులపై సంతకాలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయని ప్రకటించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కొత్త అవకాశాలకు.. ఆన్లైన్ టీచింగ్!
‣ ఆస్ట్రోఫిజిక్స్తో అపార అవకాశాలు!
‣ జనరల్ డిగ్రీతో జాబ్ సాధ్యమే!
‣ గురుకుల కొలువుల్లో ఆదరగొట్టారు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.