* ఖాళీలన్నీ తదుపరి నోటిఫికేషన్లోనే భర్తీ
* గురుకుల నియామకబోర్డు ఛైర్పర్సన్ వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గురుకుల నియామకాలు నూరుశాతం పారదర్శకంగా జరిగాయని గురుకుల నియామకబోర్డు ఛైర్పర్సన్ ఆయేషా మస్రత్ ఖానం స్పష్టం చేశారు. నియామక నిబంధనల ప్రకారం వెయిట్లిస్టు విధానం లేదని, భర్తీకాని, అభ్యర్థులు చేరని ఖాళీలు తదుపరి నోటిఫికేషన్లో భర్తీ చేస్తామని వెల్లడించారు. నియామకాలపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులు నమ్మకూడదని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం (మార్చి 15) పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘‘డీఎల్, జేఎల్ పోస్టులకు 1:2 నిష్పత్తి జాబితాతోపాటు డెమో తరగతుల తేదీలు ఫిబ్రవరి 15, 16న ప్రకటించాం. 19 నుంచి 22 వరకు డెమో తరగతులు నిర్వహించి 28న ఫలితాలు వెల్లడించాం. మార్చి 4న అభ్యర్థులకు నియామక పత్రాలు అందించాం. నిబంధనల మేరకు రిజర్వేషన్లు పాటించి పారదర్శకంగా ఎంపిక చేశాం. అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా ప్రక్రియ మొదలుపెట్టిన తక్కువ కాలంలో ఫలితాలు ఇచ్చాం. మార్కుల మెమోలు నెల రోజుల తరువాత నుంచి 90 రోజుల వరకు పొందేందుకు అవకాశం ఉంది. అర్హులైన అభ్యర్థులు మాత్రమే ఆన్లైన్లో రూ.200 చెల్లిస్తే మార్కుల మెమోలు జారీ చేస్తాం’’ అని తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.