చొప్పదండి, న్యూస్టుడే: జవహర్ నవోదయ విద్యాలయంలో 2025 - 26 విద్యాసంవత్సరంలో ఆరోతరగతి ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రధానాచార్యులు పి.మంగతాయారు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం 5వ తరగతి చదువుతూ ఉండాలని, విద్యార్థులు తప్పనిసరిగా ఉమ్మడి జిల్లా పరిధిలో నివసిస్తూ ఉండాలని కోరారు. అభ్యర్థులు 01.05.2013 నుంచి 31.07.2017 మధ్య జన్మించి ఉండాలని, మూడు, నాలుగు, అయిదు తరగతులు ప్రభుత్వ లేదా ప్రభుత్వామోదిత పాఠశాలల్లో చదువుతూ ఉండాలన్నారు. దరఖాస్తులు అంతర్జాలం ద్వారా 16.09.2024 లోపు సమర్పించాలని సూచించారు. ప్రవేశ పరీక్ష తేది 18.01.2025 ఉంటుందని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.