* అధికారికంగా ధ్రువీకరించిన న్యాక్ బృందం
JNTUH: ఈనాడు, హైదరాబాద్: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి జాతీయస్థాయిలో న్యాక్ గుర్తింపు, ఏ ప్లస్ గ్రేడ్ లభించింది. న్యాక్ (నేషనల్ అసెస్మెంట్, అక్రిడిటేషన్ కౌన్సిల్) బృందం సభ్యులు మార్చి 2వ తేదీన అధికారికంగా ఏ ప్లస్ గ్రేడ్ను ప్రకటించారు. గత ఏడాది ఏ గ్రేడ్ మాత్రమే రావటంతో జేఎన్టీయూ అధికారులు అప్పీలుకు వెళ్లారు. 90వేల మంది ఇంజినీరింగ్ విద్యార్థుల భవిష్యత్పై ఈ గ్రేడింగ్ ప్రభావం చూపనుందని దరఖాస్తులో పేర్కొన్నారు. విశ్వవిద్యాలయంపై నివేదిక పంపగా.. కొద్దిరోజుల క్రితం జేఎన్టీయూ హైదరాబాద్ను న్యాక్ బృందం సభ్యులు సందర్శించారు. పరిశోధన వివరాలు గమనించిన బృందం ఏ ప్లస్ గ్రేడ్ను ప్రకటించింది. దీనిపై వీసీ కట్టా నరసింహారెడ్డి ఆచార్యుల బృందాన్ని అభినందించారు. రాబోయే సంవత్సరంలో ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ సాధించేలా కృషి చేయాలన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.