• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 09-03-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1.  ‘సేలా’ సొరంగ మార్గాన్ని ప్రారంభించిన మోదీ
భారత్‌-చైనా సరిహద్దులో వ్యూహాత్మక ప్రాంతమైన తవాంగ్‌కు ఎలాంటి వాతావరణంలోనైనా సైనిక బలగాలను, సాయుధ సంపత్తిని తరలించేందుకుఉపయోగపడే ‘సేలా’ సొరంగ మార్గాన్ని ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌ విధానంలో ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


2.    చెక్‌ రిపబ్లిక్‌ సుందరి క్రిస్టీనాకు మిస్‌వరల్డ్‌
మిస్‌వరల్డ్‌ కిరీటాన్ని చెక్‌ రిపబ్లిక్‌ సుందరి క్రిస్టీనా జికోవా దక్కించుకున్నారు. దేశ వాణిజ్య రాజధాని ముంబయి కేంద్రంగా జరిగిన 71వ మిస్‌వరల్డ్‌-2024 గ్రాండ్‌ ఫినాలేలో మిస్‌ లెబనాన్‌ యాస్మినా జైతూన్‌ ఫస్ట్‌ రన్నరప్‌గా నిలిచారు. 
 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

3.  టెస్ట్‌ సిరీస్‌.. భారత్‌ సొంతం!
టీమ్‌ఇండియా సంపూర్ణ ఆధిపత్యంతో సత్తాచాటింది. చివరి టెస్టులో ఇంగ్లాండ్‌ను ఇన్నింగ్స్, 64 పరుగుల తేడాతో చిత్తు చేసింది. 259 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లిష్‌ జట్టు 48.1 ఓవర్లలో 195 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

4.   ఏపీలో భాజపా, తెదేపా, జనసేన కలిసి పోటీ
భాజపా, తెదేపా, జనసేన కూటమిగా ఏర్పడిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఏకపక్షంగా జరగబోతున్నాయని, తాము స్వీప్‌ చేయడం ఖాయమని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. 
 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 


5.  హమారా సంవిధాన్‌ హమారా సమ్మాన్‌ సదస్సు 
రాజస్థాన్‌లోని బికనేర్‌లో ‘హమారా సంవిధాన్‌ హమారా సమ్మాన్‌’ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు హాజరైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ మాట్లాడుతూ దేశంలో సమానత్వానికి పరస్పర సోదర భావం అవసరమని అన్నారు. 
 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 


మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 10-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.