1. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తొలి మణిపుర్ వ్యక్తి!
సుప్రీంకోర్టు చరిత్రలో కొత్త అధ్యాయం నమోదవుతోంది. తొలిసారి మణిపుర్కు చెందిన జస్టిస్ ఎన్.కోటేశ్వర్ సింగ్ పేరును సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవికి భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం సిఫార్సు చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో పావోలిని, క్రెజికోవా
ఏడో సీడ్ పావోలిని, క్రెజికోవా వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో అడుగుపెట్టారు. రసవత్తరంగా సాగిన సెమీఫైనల్లో పావోలిని 2-6, 6-4, 7-6 (8)తో అన్సీడెడ్ డోనా వెకిచ్ (క్రొయేషియా)పై విజయం సాధించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. సరికొత్త చికిత్సతో మెదడు క్యాన్సర్ మాయం!
మెదడు క్యాన్సర్ చికిత్సలో దిల్లీ ఐఐటీ ముందడుగు వేసింది. గ్లియోబ్లాస్టోమా రకం క్యాన్సర్ కణితిని అంతం చేసేందుకు ఎలుకలపై అది నిర్వహించిన ప్రీక్లినికల్ ట్రయల్స్ విజయవంతమయ్యాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. భారతీయ కెప్టెన్, సిబ్బందికి సాహస అవార్డు
ఎర్ర సముద్రంలో అత్యంత ధైర్యసాహసాలను ప్రదర్శించి నౌకను రక్షించిన భారతీయ కెప్టెన్ అహిలాశ్ రావత్, ఆయన సిబ్బందికి అంతర్జాతీయ నౌకా రవాణా సంఘం (ఐఎంవో)-2024 అవార్డు దక్కింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. స్థిరాస్తి రారాజు డీఎల్ఎఫ్ రాజీవ్ సింగ్!
స్థిరాస్తి రంగంలో సంపన్నుడుగా డీఎల్ఎఫ్ ఛైర్మన్ రాజీవ్ సింగ్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఈయన నికర సంపద రూ.1,24,420 కోట్లు అని ‘గృహ్- హురున్ ఇండియా- 2024’ జాబితా తెలిపింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.