1. టీజీటీ పోస్టుల ఫలితాల వెల్లడి
సంక్షేమ గురుకులాల్లో 4006 టీజీటీ పోస్టుల ఫలితాలను గురుకుల నియామక బోర్డు ప్రకటించింది. మొత్తం 10 సబ్జెక్టుల వారీగా పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాలను వెబ్సైట్లో పొందుపరిచింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. ఇక నుంచి అయిదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి: ఇంటర్ బోర్డు
ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులు ఇక నుంచి పరీక్షా కేంద్రానికి అయిదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతించాలని ఇంటర్ బోర్డు జిల్లా అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. 20 వరకు ఐటీఐల్లో ఒప్పంద ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ
రాష్ట్రంలో పలు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ(ఐటీఐ)ల్లో ఖాళీగా ఉన్న 71 అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ (ఏటీఓ) పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్ బి.నవ్య తెలిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. జేఈఈ మెయిన్ దరఖాస్తుకు మార్చి 2న ఆఖరు
జేఈఈ మెయిన్ చివరి విడతకు దరఖాస్తు చేసుకునే గడువు మార్చి 2తో ముగియనుంది. ఏప్రిల్ 4-15వ తేదీ మధ్య ఆన్లైన్ పరీక్షలు జరుగుతాయని జాతీయ పరీక్షల సంస్థ(ఎన్టీఏ) గతంలోనే ప్రకటించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. 3 నుంచి ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ
ఏపీ ఆదర్శ పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరోతరగతి ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. మార్చి 2 నుంచి దరఖాస్తు ఫీజు, మూడు నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.