దిల్లీ: ఈ ఏడాది జూన్ 23న జరిగే నీట్-పీజీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల ఇంటర్న్షిప్ కటాఫ్ను పొడిగించాలంటూ దాఖలైన పిటిషన్ను విచారణకు తీసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనిపై కొద్దిసేపు వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.. దీన్ని తాము పొడిగించలేమని స్పష్టంచేసింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన రిధేశ్ ఈ పిటిషన్ వేశారు. దీనిపై సంబంధిత అధికారులను ఆశ్రయించే స్వేచ్ఛను పిటిషనర్కు ధర్మాసనం ఇచ్చింది. నీట్-పీజీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఇంటర్న్షిప్ కటాఫ్ తేదీని ఆగస్టు 15గా అధికారులు నిర్ణయించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ టెక్నికల్ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం!
‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!
‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.