* ఈ వారంలో ప్రాథమిక కీ విడుదల
ఈనాడు ప్రతిభ డెస్క్: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (National Eligibility-cum-Entrance Test) యూజీ (NEET UG 2024) ఫలితాల వెల్లడికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) సమాయత్తమవుతోంది. ఈ మేరకు ఈ వారంలో ప్రిలిమినరీ కీ విడుదలతో పాటు అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. అనంతరం జూన్ 14న ఫలితాలతో పాటు తుది కీ విడుదలకానున్నాయి. పరీక్షకు 23,81,833 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. మే 5న దేశవ్యాప్తంగా 571 కేంద్రాల్లో పరీక్ష జరిగింది. ఎంబీబీఎస్(MBBS), బీడీఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.