* తీర్పు వెలువరించిన అత్యున్నత న్యాయస్థానం
దిల్లీ: నీట్ ప్రశ్నపత్రం లీకైన మాట వాస్తవమేనని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. నీట్ అంశంపై విచారణ ముగియడంతో సీజేఐ ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. నీట్ మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ‘‘ప్రశ్నపత్రం లీకేజీతో పరిమిత సంఖ్యలో విద్యార్థులు లబ్ధిపొందారు. మళ్లీ పరీక్షలు నిర్వహిస్తే 24లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడతారు. అందువల్ల నీట్ మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదు’’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.