తెలంగాణలో ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగే ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు తత్కాల్ పథకం కింద రుసుములు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు సొసైటీ సంచాలకుడు శ్రీహరి తెలిపారు. పదో తరగతికి రూ.500, ఇంటర్మీడియట్కు రూ.వేయి చొప్పున ఆలస్య రుసుములతో ఈ నెల 18 నుంచి 21 వరకు చెల్లించవచ్చని సూచించారు. డీఈవోల వద్ద 22 వరకు, ప్రధాన కార్యాలయంలో 23 వరకు చెల్లించే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.