![]() |
ఈనాడు, అమరావతి: నీట్ పీజీ ద్వారా ఇన్సర్వీస్ కోటాలో కేటాయించే సీట్ల సంఖ్య తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్ అనస్థీషియా, ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషాలిటీల్లో 15%, నాన్-క్లినికల్ కేటగిరీ విభాగాల్లో 30% సీట్లనే భర్తీ చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఈ ఉత్తర్వుల్ని 2024-25లో అమలుచేస్తారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి స్పెషాలిటీల వారీగా భర్తీ చేసే సీట్ల సంఖ్యను ప్రకటిస్తారు. క్లినికల్ విభాగంలో 15%, నాన్-క్లినికల్ విభాగంలో 30% మించకుండా సీట్ల కేటాయింపు ఉంటుంది. పీజీ పూర్తిచేసిన వారు పదేళ్లపాటు విధిగా ప్రభుత్వ సర్వీసులో పనిచేయాలి. ఒప్పందంలో పేర్కొన్న ప్రకారం వ్యవహరించని వైద్యుల అర్హత సర్టిఫికెట్లను రద్దుచేసే అధికారం విశ్వవిద్యాలయానికి ఉంది. అంతేకాకుండా రూ.50 లక్షల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.