గుంటూరు విద్య, న్యూస్టుడే: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి ఏప్రిల్ 27న జరగనున్న ఏపీ పాలిసెట్- 2024కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు హిందూ ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కళాశాల కార్యదర్శి చెరువు రామకృష్ణమూర్తి తెలిపారు. శనివారం శిక్షణకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా రామకృష్ణమూర్తి మాట్లాడుతూ ఏప్రిల్ 1 నుంచి 25వ తేదీ వరకు మార్కెట్ కూడలిలోని హిందూ కళాశాలలో శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అమరావతిరోడ్డులోని హిందూ ఇంజినీరింగ్ కళాశాలలో నేరుగా సంప్రదించి నమోదు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు ఫోన్నెం.83329 11155, 93907 87574లో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ పి.ఐజాక్ ప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ వజ్రాల నర్సిరెడ్డి, అధ్యాపకులు కృష్ణార్జునరావు పాల్గొన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.