* మార్చి 19 దరఖాస్తుకు గడువు
ఈనాడు, అమరావతి: ఏపీలోని విశ్వవిద్యాలయాల్లో పీహెచ్డీ సీట్ల భర్తీకి ఫిబ్రవరి 20 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఉన్నత విద్యామండలి వెల్లడించింది. ఈ మేరకు ఆర్సెట్ 2023-24కు నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 19లోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించింది. ఏప్రిల్ 4 నుంచి 7 వరకు దరఖాస్తుల్లో తప్పుల సవరణలకు వెసులుబాటు కల్పించింది. ప్రవేశ పరీక్ష తేదీని ఖరారు చేయలేదు. ఏప్రిల్లో రెండు విడతలుగా పరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. సమగ్ర సమాచారం కోసం 90304 07022 సంప్రదించొచ్చని సూచించింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.