* గిరిజన విద్యార్థులకే ఎక్కువ సీట్లు
* కిషన్రెడ్డి వెల్లడి
ఈనాడు- వరంగల్, దిల్లీ; కాజీపేట, న్యూస్టుడే: ములుగులో ఏర్పాటు కానున్న సమ్మక్క-సారక్క గిరిజన విశ్వవిద్యాలయంలో ఈ ఏడాది నుంచే ప్రవేశాలు చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించారని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి తెలిపారు. వర్సిటీలో ఎక్కువ సీట్లు గిరిజన విద్యార్థులకు కేటాయిస్తామని ప్రకటించారు. గురువారం (ఫిబ్రవరి 22) ఆయన మేడారం జాతరలో పాల్గొని, సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించారు. ములుగులో రూ.900 కోట్లతో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే 337 ఎకరాల భూసేకరణ పూర్తయిందని, తాత్కాలిక భవనంలో ఈ ఏడాది తరగతులు నిర్వహిస్తామని వెల్లడించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.