* 26, 27 తేదీల్లో ఖాళీసీట్ల భర్తీ
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎస్సీ గురుకుల జూనియర్, ఒకేషనల్ కళాశాలల్లో మిగిలిన సీట్ల భర్తీకోసం జులై 26, 27 తేదీల్లో స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు గురుకుల సొసైటీ కార్యదర్శి వర్షిణి తెలిపారు. 26న బాలికలకు, 27న బాలురకు ఉదయం 9గంటల నుంచి అడ్మిషన్లు ప్రారంభమవుతాయన్నారు.
అడ్మిషన్లు జరిగే కాలేజీలివే..
స్పాట్ కౌన్సెలింగ్ సంబంధిత రీజియన్ల పరిధిలోని బాలికలకు లక్సెట్టిపేట, చింతకుంట, వరంగల్ వెస్ట్, టేకులపల్లి, చేవెళ్ల, మెదక్, మహబూబ్నగర్ (రామిరెడ్డి గూడెం), ధర్మారం, నిడదమానూరు, వలిగొండ బాలికల విద్యాసంస్థల్లో, బాలురకు బెల్లంపల్లి, పెద్దపల్లి, వర్ధన్నపేట, తిరుమలాయపాలెం, కందుకూరు, హత్నూర యూజీ, జేపీనగర్, భిక్నూరు, అనుముల, భువనగిరి బాలుర కళాశాలల్లో అడ్మిషన్లు జరుగుతాయన్నారు.