* డైరెక్ట్ డౌన్లోడ్ లింక్ ఇదే..
* మొత్తం 26,146 పోస్టుల భర్తీ
* ఫిబ్రవరి 29 నుంచి పరీక్షలు
ఈనాడు ప్రతిభ డెస్క్: కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్/ రైఫిల్మ్యాన్ ఖాళీల నియామక రాత పరీక్ష అడ్మిట్కార్డులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 26,146 పోస్టులు భర్తీ కానున్నాయి. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి పరీక్ష అడ్మిట్కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ పరీక్షలు ఫిబ్రవరి 29 నుంచి మార్చి 12వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇంగ్లిష్, హిందీ భాషల్లోనే కాకుండా; తెలుగు సహా మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో పరీక్ష ఉంటుంది. రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ తదితర పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
సదరన్ రీజియన్ అడ్మిట్కార్డు కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.