* పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వెల్లడి
![]() |
ఈనాడు, అమరావతి: ‘తల్లికి వందనం’ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. ఈ పథకంలో భాగంగా విద్యార్థుల తల్లులకు రూ.15 వేలే ఆర్థిక సాయం అందిస్తారని తప్పుడు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన స్పష్టత ఇచ్చారు. పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం అవాస్తమని, వాటిని నమ్మొద్దని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధార్ నిబంధనలకు సంబంధించిన ఉత్తర్వులు మాత్రమే ఇచ్చిందని, ప్రభుత్వ శాఖలు ఏ పథకాలకైనా లబ్ధిదారులను గుర్తించేందుకు ఆధార్ ఉపయోగించుకోవాల్సి వస్తే గెజిట్ పబ్లికేషన్ చేసి, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని యూఐడీఏఐ అనుమతులు పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆధార్ సేవలు వినియోగించుకునేందుకే ఉత్తర్వులు-29 విడుదల చేశామని వెల్లడించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.