• facebook
  • whatsapp
  • telegram

Talliki vandanam: ‘తల్లికి వందనం’ మార్గదర్శకాలు ఇవ్వలేదు 

* పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వెల్లడి

ఈనాడు, అమరావతి: ‘తల్లికి వందనం’ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ తెలిపారు. ఈ పథకంలో భాగంగా విద్యార్థుల తల్లులకు రూ.15 వేలే ఆర్థిక సాయం అందిస్తారని తప్పుడు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన స్పష్టత ఇచ్చారు. పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం అవాస్తమని, వాటిని నమ్మొద్దని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధార్‌ నిబంధనలకు సంబంధించిన ఉత్తర్వులు మాత్రమే ఇచ్చిందని, ప్రభుత్వ శాఖలు ఏ పథకాలకైనా లబ్ధిదారులను గుర్తించేందుకు ఆధార్‌ ఉపయోగించుకోవాల్సి వస్తే గెజిట్‌ పబ్లికేషన్‌ చేసి, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని యూఐడీఏఐ అనుమతులు పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆధార్‌ సేవలు వినియోగించుకునేందుకే ఉత్తర్వులు-29 విడుదల చేశామని వెల్లడించారు. 
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 12-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.