ఈనాడు, హైదరాబాద్: డీఎస్సీతోపాటు టెట్ నిర్వహించి విద్యార్థులు, నిరుద్యోగుల అవకాశాలు దెబ్బతినకుండా చూడాలని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు కోరారు. ఈ మేరకు మార్చి 12న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి లేఖ రాశారు. ‘‘తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయుల నియామకం కోసం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, ఇటీవలి కాలంలో టెట్ నిర్వహించకపోవడం వల్ల దాదాపు 7లక్షల మంది డీఎడ్, బీఎడ్ విద్యార్థులు డీఎస్సీకి దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. అంతేకాకుండా గత డిసెంబరులో డీఎడ్, బీఎడ్ కోర్సులు పూర్తి చేసుకున్న వారు దాదాపుగా 50వేల పైచిలుకు మంది ఉంటారు. టెట్లో ఉత్తీర్ణత సాధిస్తేనే డీఎస్సీకి దరఖాస్తు చేయడానికి అర్హులవుతారనే విషయం మీకు తెలిసిందే. గత ఏడాది భారాస ప్రభుత్వం టెట్ నిర్వహించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరపలేదు. వెంటనే టెట్ నిర్వహించి అభ్యర్థులకు న్యాయం చేయాలి’’ అని హరీశ్రావు ఆ లేఖలో పేర్కొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కొత్త అవకాశాలకు.. ఆన్లైన్ టీచింగ్!
‣ ఆస్ట్రోఫిజిక్స్తో అపార అవకాశాలు!
‣ జనరల్ డిగ్రీతో జాబ్ సాధ్యమే!
‣ గురుకుల కొలువుల్లో ఆదరగొట్టారు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.