* టీజీపీఎస్సీ స్పష్టీకరణ
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2, 3 పరీక్షలను రీషెడ్యూలు చేసినట్లు సోషల్మీడియా, వివిధ వాట్సప్ గ్రూపుల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. ‘ఈ రెండు సర్వీసుల పరీక్షలను కమిషన్ వాయిదా వేసినట్లు కొన్ని గ్రూపుల్లో వెబ్నోట్ సర్క్యులేట్ అవుతోంది. గ్రూప్-2 పరీక్షలు నవంబర్ 17, 18న, గ్రూప్-3 పరీక్షలు నవంబర్ 24, 25వ తేదీకి మార్చారంటూ టీజీపీఎస్సీ పేరిట కొందరి నకిలీ వెబ్నోట్ సృష్టించి, వాట్సప్ గ్రూపుల్లో ప్రచారం చేశారు. ఈ నకిలీ సమాచారాన్ని ఎవరూ నమ్మవద్దు’ అని కమిషన్ పేర్కొంది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.