* పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్న అభ్యర్థులు
హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల అంశంపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సచివాలయంలో అభ్యర్థులతో చర్చిస్తున్నారు. డీఎస్సీ, గ్రూప్-2 పరీక్షల మధ్య వారం రోజుల మాత్రమే వ్యవధి ఉండటంతో వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్ తదితరులు చర్చల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో మొత్తం 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఆగస్టు 7, 8 తేదీల్లో పరీక్షలు నిర్వహించాలని మార్చి నెలలో కమిషన్ నిర్ణయించిన విషయం తెలిసిందే. గ్రూప్-2 ఉద్యోగాలకు 5.51లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.