* 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక
ఈనాడు, హైదరాబాద్: సాంకేతిక, ఇంటర్ విద్య విభాగాల్లో లైబ్రేరియన్ పోస్టులకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన మార్చి 5న నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ శుక్రవారం తెలిపింది. ఉదయం 10.30 గంటల నుంచి టీఎస్పీఎస్సీ కార్యాలయంలో పరిశీలన ఉంటుందని పేర్కొంది. 1:2 నిష్పత్తిలో ఎంపికైన అభ్యర్థుల జాబితా కమిషన్ వెబ్సైట్లో ఉందని, పరిశీలనకు వచ్చే అభ్యర్థులందరూ చెక్లిస్టులోని పత్రాలు తీసుకురావాలని సూచించింది. పరిశీలనలో ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలు సమర్పించకుంటే తదుపరి సమయం ఇవ్వబోమని కమిషన్ స్పష్టం చేసింది. షెడ్యూలు ప్రకారం పరిశీలనకు రాకుంటే అభ్యర్థిత్వాన్ని నియామక ప్రక్రియలో పరిశీలించబోమని వెల్లడించింది.
లైబ్రేరియన్ పోస్టుల ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.